లోక్సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా అధీర్ రంజన్ చౌదరి వ్యవహరించనున్నారు. మంగళవారం నాడు సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. బెంగాల్ రాష్ట్రం నుండి ఐదు దఫాలు అధీర్ చౌదరి ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో బెంగాల్ పీసీసీ చీఫ్ గా కూడ ఆయన పనిచేశారు. యూపీఏ 2 లో అధీర్ చౌదరి కేంద్ర మంత్రిగా పనిచేశారు. గత లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించిన మల్లికార్జున ఖర్గే ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. రాహుల్ గాంధీ లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేతగా బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖంగా లేరు. దీంతో లోక్సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా అధీర్ రంజన్ ను ఎన్నుకొన్నారు.