ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా అధీర్ రంజన్ చౌదరి

national |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2019, 07:35 PM

లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా  అధీర్ రంజన్ చౌదరి వ్యవహరించనున్నారు. మంగళవారం నాడు సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ  పార్లమెంటరీ పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. బెంగాల్ రాష్ట్రం నుండి  ఐదు దఫాలు అధీర్ చౌదరి ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో బెంగాల్ పీసీసీ చీఫ్ గా కూడ ఆయన పనిచేశారు.  యూపీఏ 2 లో అధీర్ చౌదరి కేంద్ర మంత్రిగా పనిచేశారు. గత లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా  వ్యవహరించిన మల్లికార్జున ఖర్గే  ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖంగా లేరు.  దీంతో లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా అధీర్ రంజన్ ను ఎన్నుకొన్నారు.  


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com