మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఇరాన్తో తలెత్తిన ఉద్రిక్తత ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అత్యంత క్లిష్ట పరిస్థితికి దారి తీస్తోంది. ఇటీవల వరుసగా ఆ రూట్లో వెళ్తున్న ఇంధన నౌకలను పేల్చేస్తున్న నేపథ్యంలో.. అమెరికా ప్రత్యేక దళాలను మోహరిస్తోంది. అదనంగా సుమారు వెయ్యి మంది భద్రతా దళాలను మిడిల్ ఈస్ట్కు అమెరికా పంపిస్తోంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో గత వారం రెండు నౌకలకు నిప్పు అంటించారు. ఆ పని చేసింది ఇరాన్ అని తాజాగా అమెరికా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇంధనం తరలిస్తున్న భారీ నౌకలను ఇరాన్ మైన్లతో పేలుస్తున్నదని అమెరికా ఆరోపిస్తున్నది. కానీ ఆ ఆరోపణలను ఇరాన్ కొట్టిపారేసింది. శుద్ధీకరించిన యురేనియం ఉత్పత్తులను పెంచుకోనున్నట్లు రెండు రోజుల క్రితం ఇరాన్ వెల్లడించింది. 2015 అణు నిరాయుధీకరణ ఒప్పందం నుంచి కూడా తప్పుకోనున్నట్లు ఇరాన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్పై ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఆ తర్వాతే ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది.