మాజీ ముఖ్యమంత్రి. తమిళనాడు గవర్నర్ రోశయ్య ను సినీ నిర్మాత, దర్శకుడు,అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కలుసుకుని పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. సోమవారం హైదరాబాద్ వచ్చిన ఆయన నేరుగా విమానాశ్రయం నుంచి బల్కంపేటలో ని రోసయ్య ఇంటికి వెళ్లారు. మర్యాద పూర్వకంగా కలుసుకున్నానని జగదీశ్వర రెడ్డి చెపుతున్నా, జయలలిత బయోపిక్ను శశిలలిత పేరుతో వెండితెరపైకి ఎక్కిస్తున్నందునే కలసినట్టు వినవస్తోంది. ఈ సందర్భంగా జయతో తనకున్న అనుబంధాన్ని, శశికళ వర్గం చేసిన పనులను రోశయ్యను అడిగి జగదీశ్వర రెడ్డి తెలుసుకున్నట్టు భోగట్టా.