నైజీరియాలోని బొకొహరంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని కొండుగలో ఆత్మాహుతి దాడులు జరిపారు. ఈ ఘటనలో 30మంది మృత్యువాత పడ్డారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫుట్బాల్ అభిమానులు అందరూ గుంపుగా టీవీలో మ్యాచ్ చూస్తుండగా ముగ్గురు మిలిటెంట్లు తమను తాము కాల్చుకున్నారు. దీంతో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు ఆ దేశ అత్యవసర విభాగం వెల్లడించింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.