దేశంలో సరుకు రవాణా వాహనాలకు చార్జీల తగ్గించేందుకు కొత్త టోల్ పాలసీని తేవాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ హైవేల సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆధ్వర్యంలో రూపొందుతున్న ముసాయిదాకు త్వరలోనే తుదిరూపు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.అయితే ఈ ముసాయిదాను నోటిఫై చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. కాగా సరుకు రవాణా వాహనాలకు ఇచ్చే మినహాయింపుల కారణంగా కోల్పోయే మొత్తాలను కార్ల తో సహా ఇతర ప్రజా రవాణా వాహన వినియోగదారులపై భారం వేయాలన్న నిర్ణయంపై నిరసనలు వినిపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కూడా చూడాల్సి ఉందన్నారు సదరు మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు.