ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. ఎదురుచూపులు ముగిశాయి. 2019 మిస్ ఇండియా ఎవరో ప్రకటించేశారు. మరెవరో కాదు రాజస్థాన్కి చెందిన 20 ఏళ్ల సుమన్ రావు ఈ ఏడాది మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. రన్నరప్గా చత్తీస్గఢ్కు చెందిన శివానీ జాదవ్ నిలిచారు. తమిళనాడుకు చెందిన మాజీ మిస్ ఇండియా అనుకీర్తి వాస్… మిస్ ఇండియా కిరీటాన్ని సుమన్ రావుకి ధరింపజేసింది. గతేడాది రన్నరప్ గా నిలిచిన హర్యానాకు చెందిన మీనాక్షీ చౌదరి… ఈ ఏడాది రన్నరప్కి తన కిరీటాన్ని బహూకరించింది. అలాగే 2018లో సెకండ్ రన్నరప్గా నిలిచిన ఆంధ్రప్రదేశ్కి చెందిన శ్రేయా రావు కామవరపు… ఈ ఏడాది తన కిరీటాన్ని సెకండ్ రన్నరప్గా నిలిచిన తెలంగాణకు చెందిన సంజనా విజ్కి తొడిగింది. మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2019గా బీహార్కి చెందిన శ్రేయా శంకర్ నిలవగా… మిస్ గ్రాండ్ ఇండియా 2019గా ఛత్తీస్గఢ్కి చెందిన శివానీ జాదవ్ నిలిచింది. ఆమె ఫస్ట్ రన్నరప్ కూడా. ముంబయిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి. బాలీవుడ్ స్టార్లు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, నోరా ఫతేహీ, మౌనీరాయ్ ఈ వేడుకలో తమ డ్యాన్సులతో అదరగొట్టారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, మిస్ వరల్డ్ -2017 మానుషీ చిల్లర్, మనీశ్ పాల్ హోస్ట్లుగా వ్యవహరించారు.