జనం సమస్యలతో పాటు తను చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ప్రధాని మోడీ ఏర్పాటు చేసుకున్న ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం ఎన్నికల సందర్భంగా విరామం కాగా తాజాగా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం ప్రధాని మీడియాలో మాట్లాడుతూ తను రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జూన్ 30న ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పై ప్రజలు తమ అభిప్రాయాలు పంచుకునేలా నమో యాప్, మైగవ్ సైట్ లను వినయోగించాలని, టోల్ ఫ్రీ నంబరు 1800117800 కు ఫోన్ చేసి ప్రజలు తన పాలనని మరింత విజయవంతమయ్యేలా తగిన సలహాలు సూచనలు కూడా అందించాలని కోరారు.