జేబు దొంగల చేతివాటం నుంచి ఎమ్మెల్యే కూడా తపించుకోలేకపోయాడు. దీంతో దొంగల పట్ల సామాన్యులు, వీఐపీలు అనే భేదం ఉండదని అర్దమవుతోంది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తలారి వెంకట్రావుకు ఈ రకమైన చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత మొదటిసారి ద్వారక తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు. ఈ సందర్భంగా ఓ దొంగ ఎమ్మెల్యే జేబు కొట్టేశాడు. దేవుడిని దర్శించుకుని బయటకు వచ్చిన ఎమ్మెల్యేను పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఎమ్మెల్యే వారితో కరచాలనం చేశారు. ఈ క్రమంలోనే ఆయన జేబులోని రూ.30 వేల నగదును దొంగ కొట్టేశాడని తెలుస్తోంది.