ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక కళా భవనంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతిఆయోగ్ పాలకమండలి భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదాపై వివరించేందుకు నివేదికను సిద్ధం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను జగన్ వివరించనున్నారు. విభజన సమస్యల పరిష్కారం, లోటు బడ్జెట్ వివరాలను నీతి ఆయోగ్ ముందుంచనున్నారు.