ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థానీ ఫ్యాన్‌కు టిక్కెట్లు పంపిన ధోని!

national |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2019, 02:21 PM

భారత మాజీ సారధి మహేంద్రసింగ్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. మైదానంలో ధోని ఆటతీరు, అతడి ప్రవర్తన చూసి ఎంతోమంది అభిమానులు ధోనిని ఆరాధిస్తారు. ఇకపోతే ఆయనకు దాయాది దేశమైన పాకిస్థాన్‌లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అసలు విషయానికి వస్తే.. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన మహమ్మద్ బషీర్.. ధోనికి వీరాభిమాని. అతడికి, ధోనికి మధ్య స్నేహం 2011 ప్రపంచకప్ సెమీఫైనల్ నుంచి ప్రారంభమైంది. బషీర్ తాజాగా ఆదివారం జరిగే భారత్- పాక్ మ్యాచ్ కోసం చికాగో నుంచి మాంచెస్టర్ వచ్చాడు. అయితే అతని దగ్గర మ్యాచ్ వీక్షించడానికి టికెట్ లేదు. కానీ తనకోసం ధోని తప్పకుండా ఏదో ఒకటి చేస్తాడనే నమ్మకంతో మాంచెస్టర్‌కు చేరుకున్నాడట. సరిగ్గా ఆయన అనుకున్నట్లే కెప్టెన్ కూల్.. అతనికి కష్టం కలగకుండా మ్యాచ్ టికెట్ పంపించాడు.


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బషీర్ ‘నేను మాంచెస్టర్ నిన్నే వచ్చానని అన్నాడు. ప్రతీ ఒక్కరు టికెట్ కోసం 800-900 పౌండ్లు ఖర్చు చేయడం చూశాను.. కానీ నాకు తిరిగి చికాగో వెళ్ళడానికి కూడా ఆంటే ఖర్చు అవుతుంది. అలాంటి తరుణంలో నేను కష్టపడకుండా.. మ్యాచ్‌ను వీక్షించడానికి సహాయం చేసిన ధోనికి నా కృతఙ్ఞతలు’ అని బషీర్ అన్నాడు.


‘నేను ఎప్పుడూ ధోనికి ఫోన్ చేయను. కేవలం వీలు దొరికినప్పుడల్లా మెసేజ్‌లు పెడుతూ అతనితో టచ్‌లో ఉంటానని’ బషీర్ తెలిపాడు. నేనిక్కడికి రాకముందే మ్యాచ్ టికెట్ గురించి ధోని నాకు హామీ ఇచ్చాడని ఆయన చెప్పారు. ఇక ఈ చికాగో చాచాని ఎప్పుడూ నిరాశపరచని ధోనికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com