జార్ఖండ్లోని జంషెడ్పూర్ సమీపంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయి, పోలీసులను హత్య చేయటమే కాకుండా ఆయుధాలను ఎత్తుకెళ్లిన ఘటన తాజాగా వెలుగు చూసింది. స్థానిక పోలీసులు అందిస్తున్న వివరాలలోకి వెళితే... జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దు సమీపంలోని సరైకేలా జిల్లాలో ఒక మార్కెట్లో పోలీసులు శుక్రవారం సాయంత్రం గస్తీ నిర్వహిస్తూ ఉండగా వారిపై సాయుధులైన ఇద్దరు మావోయిస్టులు దాడి చేయటంతో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మరణించారని, ఆపై పోలీసు వాహనంలో ఉన్న ఆయుధాలును కూడా ఎత్తుకెళ్లారని చెపుతున్నారు.
మరోవైపు ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, పోలీసులకు నడుమ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కాంకేర్ జిల్లా తడోకీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్నార్ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రెండు తుపాకులతో పాటు భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం అందుతోంది.