ట్రెండింగ్
Epaper    English    தமிழ்

20న ఆర్ధిక శాఖ‌తో ప్ర‌ధాని ప్ర‌త్యేక స‌మావేశం

national |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2019, 01:43 PM

త్వ‌ర‌లో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్ కంటే ముందుగానేఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఐదు డిపార్ట్‌మెంట్ల ఉన్నతాధికారులతో ఈ నెల 20న  ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కాబోతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం,  ప్ర‌ధానంగా నిరుద్యోగుల‌కు ఉద్యోగ కల్పనపై  చర్చించనున్నార‌ని స‌మాచారం.  కాగా అదేరోజు జరుగాల్సిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం  మరుసటిరోజుకు వాయిదా వేసిన‌ట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  జూలై 5న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కంటే ముందుగా ఈ సమావేశం జరుగుతుండటంతో దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది.  


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com