కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డికి వచ్చిన బెదిరింపు కాల్స్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. గత నెల 20న ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చాయని, . ఉర్దూలో ఆయనను దూషించడంతో కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ 506 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్నారు. కిషన్రెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 69734063 నంబర్ నుంచి అజ్ఞాత వ్యక్తులు కాల్ చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్న విషయం విదితమే. అప్పట్లో లైట్ తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావటంతో కేసు నమోదు చేసి. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు.