కార్గిల్ పోరాటం ముగిసి 20 ఏళ్లుపూర్తవుతున్న సందర్భంగా విజయ్ దివస్’ పేరిట భారీఎత్తున సంబరాలు నిర్వహించాలని భారతీయ ఆర్మీ పలు కార్యక్రమాలురూపొందించింది. ఈ మేరకు జూలై 25 నుంచి 27 వరకు ఢిల్లీ నుంచి జమ్మూ-కాశ్మీర్లోని ద్రాస్ వరకు భారీ ఎత్తున నిర్వహించే ‘కార్గిల్ గెలుపు సంబరాలు’ నిర్వహించాలని నిర్ణయించింది. దేశ రాజధాని ఢిల్లీలో జూలై 14న జాతీయ యుద్ధ స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్గిల్ గెలుపు సంబరాలు ప్రారంభమై,నుంచి తొలుత ప్రారంభమయ్యే ఈ కార్గిల్ జ్యోతి దేశంలోని 11 పట్టణాలు, నగరాల్లో కొనసాగి, చివరకు జమ్మూ-కాశ్మీర్లోని ద్రాస్లో కలవడం ద్వారా ముగుస్తుంది, ఈసందర్భంగా ఆయా ప్రాంతాల్లో విద్య, దేశభక్తి, ప్రముఖ వ్యక్తులతో చర్చాగోష్టి, వివిధ విద్యా సంస్థల్లో విద్యార్థులను కలుసుకొంటారు. అలాగే టోలోలింగ్, టైగర్ హిల్, పీటీ 4875 వంటి ప్రాంతాలలో యుద్ధంలో పాల్గొన్నవారితో ఎన్సీసీ కేడెట్ల కోసం ప్రత్యేక జాతీయ సమగ్రతా శిబిరాలు ఏర్పాటుచేసారు. 12 రోజులపాటు ఈ కార్యక్రమాలు కొనసాగి చివరకు లెహ్ ప్రాంతంతో ముగుస్తాయి.