పశ్చిమ బెంగాల్లో డాక్టర్ల సమ్మె నేటికి ఐదవ రోజుకు చేరింది. ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఒక జూనియర్ డాక్టర్పై రోగి బంధువులు దాడి చేసి కొట్టడంతో జూనియర్ డాక్టర్లందరూ ఆందోళన బాట పట్టారు. వారికి మద్దతుగా సీనియర్ డాక్టర్లు ఒక రోజు సమ్మెలో పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో డాక్టర్లందరూ వారికి మద్దతు ప్రకటించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) సభ్యులు వారికి మద్దతు ప్రకటించారు. సోమవారంనాడు దేశవ్యాప్తంగా డాక్టర్లు సమ్మెలో పాల్గొనాలని ఐఎంఎ పిలుపునిచ్చింది.