గుజరాత్లోని నలుగురు పారిశుద్ధ కార్మికులతో ఏడు గురు మృతిచెందిన ఘటన వడోదరాలోని ఫర్తికుయి గ్రామంలో జరిగింది. వివరాలలోకి వెళితే ఫర్తికుయి వద్ద ఉన్న ఓ హోటల్లోని సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు కొందరు కార్మికులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు వారు ట్యాంక్ శుభ్రపరిచే పనిలో ఉండగా ట్యాంక్లోని వ్యర్ధాల నుంచి వెలువడిన గ్యాస్ కారణంగా ఊపిరి ఆడకపోవడం నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరి ముగ్గురు ఆసుప్రతిలో చికిత్స పొందుతు మరణించారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.