తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూల నుంచి వస్తున్న భక్తులు రోజు ఏదో ఓ రూపంలో కానుకలు సమర్పిస్తూనే ఉంటారు. దీంతో స్వామివారి ఆభరణాలు, ఆస్తులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా శ్రీవారికి మరో భారీ కానుక అందనుంది. తమిళనాడుకు చెందిన తంగదొరై అనే భక్తుడు 6 కేజిల బంగారు కఠి హస్తం, వరద హస్తంను శనివారం ఉదయం టీటీడీ అధికారులకు అందచేయనున్నారు. వీటి విలువ దాదాపు 2.25 కోట్లు ఉంటుందని అంచనా. శనివారం సుప్రభాత సేవ సందర్భంగా ఈ ఆభరణాలను ఆలయ అధికారులకు సమర్పించారు.