నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఇవాళ సమావేశం అవుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఆ సమావేశం జరగనున్నది. రాష్ట్రపతి భవన్లో సమావేశం ఉంటుంది. ఎన్డీఏ కూటమి రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం ఇది. రైతుల సమస్యలు, కరువు, మావో ప్రభావిత ప్రాంతాల్లో భద్రత లాంటి అంశాలను ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. నీతి ఆయోగ్ సమావేశానికి దూరం కానున్నారు. నీతి ఆయోగ్ సమావేశం వ్యర్థమని దీదీ అన్నారు. రాష్ట్ర ప్రణాళికలకు ఆర్థిక శక్తినిచ్చే సత్తా నీతి ఆయోగ్కు లేదన్నారు.