కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నేడు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్ శంకర్, హెచ్ నగేశ్లు నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ వజుభాయ్ వాలా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.