ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ దే వరల్డ్ కప్ : పిచాయ్

international |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2019, 02:56 PM

భారత్‌- ఇంగ్లండ్‌ జట్టు ఫైనల్‌కు వెళ్తాయని, మెన్‌ ఇన్‌ బ్లూ (భారత జట్టు) టైటిల్‌ను గెల్చుకుంటుందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాచ్‌ అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న పిచాయ్‌ క్రికెట్‌ గురించి మాట్లాడుతూ తాను ఓ క్రికెట్‌ అభిమానినని అభివర్ణించుకున్నారు. ప్రపంచకప్‌ తుది పోరు భారత్‌- ఇంగ్లండ్‌ మధ్యే ఉంటుంది. కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ కూడా చాలా సమర్థవంతమైన జట్లు అని వ్యాఖ్యానించారు. క్రికెట్‌, బేస్‌ బాల్‌ ఆటలను పోల్చుతూ సుందర్‌ పిచాయి తన అనుభవాలను పంచుకున్నారు. ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచకప్‌ జరుగుతోంది. ఇది చాలా అద్భుతమైన టోర్నమెంట్‌. భారత్‌ చాలా బాగా ఆడుతుందని నేను భావిస్తున్నాను. కానీ, ఇక్కడ చాలా పోటీ ఉంది. క్రికెట్‌లో పరుగులు తీస్తున్న సమయంలో ఎల్లప్పుడూ బ్యాట్‌ను పట్టుకునే పరుగులు తీయాలి. నాకు అప్పుడు తెలిసింది బేస్‌బాల్‌ ఆటా చాలా భిన్నమైందని, నేను చాలా విషయాలపై సర్దుకుపోగలను. కానీ, క్రికెట్‌ పట్ల మాత్రం నా అభిప్రాయాన్ని మార్చుకునేందుకు సిద్ధంగా లేను అని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com