అమరావతి: చెవిరెడ్డి కామెంట్స్పై శాసనసభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ను ఛైర్లో కూర్చోబెట్టడానికి చంద్రబాబు బంట్రోతును పంపించారన్న చెవిరెడ్డి వ్యాఖ్యలకు టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడ్ని చెవిరెడ్డి బంట్రోతు అనడంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ను చైర్ వద్దకు తీసుకెళ్లడంపై సభలో రాద్ధాంతం మొదలైంది. సభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.