గుజరాత్ తీరాన్ని వాయు తుపాన్ గురువారంనాడు తాకనున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. కచ్నుంచి దక్షితన గుజరాత్ వరకూ ఉన్న కోస్తా తీర ప్రాంతాలనుంచి సుమారు 3 లక్షలమందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. గుజరాత్లో స్కూళ్లు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుజరాత్, కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూలకు సమగ్ర సమాచారాన్ని, సలహాలను అందజేసింది.