పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్లు మోసగించి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ బెయిల్ కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాండ్స్వర్త్ జైలులో పరిస్థితులు బాగాలేవని, నివసించడం కష్టమని పేర్కొంటూ నీరవ్ మోడీ తరఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను దిగువ కోర్టు కొట్టివేసింది. నీరవ్ మోడీ బెయిల్ పటిషన్పై ఉన్నత న్యాయస్థానంలో ఉదయం పదిన్నర గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలు) విచారణ జరునున్నది. నీరవ్ మోడీని భారత్కు తరలించే అంశంపై కేసును విచారిస్తున్న వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ఇప్పటికి మూడుసార్లు నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది.