అమెరికాకు చెందిన ఖరీదైన ' హ్యార్లీ డేవిడ్సన్ ' మోటార్ బైక్ లపై అత్యధిక సుంకాలను విధిస్తున్నారని... దీన్ని తాము అంగీకరించలేమని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనాన్ని వ్యక్తం చేశారు. అమెరికా ఒక బ్యాంకు లాంటిదని.... ప్రతి ఒక్కరూ తమ దేశాన్ని దోచుకోవాలనుకుంటున్నారని ట్రంప్ మండిపడ్డారు. తన నాయకత్వంలో ఇలాంటి దోపిడీ లు ఎంతో కాలం సాగవని హెచ్చరించారు. తమ మోటార్ బైక్ లపై భారత్ 100 శాతం సుంకాన్ని విధించిందని... ఇదే సమయంలో తాము మాత్రం ఎలాంటి సుంకాలను విధించలేదని చెప్పారు. తన కోరిక మేరకు ఈ సుంకాన్ని మోడి 50 శాతానికి తగ్గించారని... దీన్ని కూడా తాము అంగీకరించలేమని... ఈ సుంకాన్ని సున్నా శాతానికి తీసుకొస్తారని ఆకాంక్షిస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలను వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ట్రంప్ విమర్శించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలను వసూలు చేస్తోందన్నారు. భారత్ ను ' సుంకాల రారాజు ' గా అభివర్ణించారు.