చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ట్విట్టర్ లో ఆయన స్పందిస్తూ… ప్రజలను, వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న మాజీ స్పీకర్ కోడెల కుటుంబ సభ్యులు చట్టం నుంచి తప్పించుకోలేరని ఆయన చెప్పుకొచ్చారు. కోడెల కొడుకు, కూతురుపై పోలీసు కేసు నమోదైనట్లు వచ్చిన వార్తలపై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ఈవిధంగా రియాక్ట్ అయ్యారు. కోడెల కుటుంబం ‘కే’ టాక్స్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కోడెలకు సహకరించిన అధికారులు కూడా దోషులేనని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. నిర్భంధ వసూళ్ల మాఫియా ఆగడాలపై దర్యాప్తు జరుగుతోందని.. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఆయన ఎంపీ పిలుపునిచ్చారు. 99 శాతం రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో అమలుకు వీలుకాని హామీలు ప్రకటిస్తున్నారు. చంద్రబాబులాంటి వాళ్లు గెలిచాక మేనిఫెస్టోను మాయం చేశారు. జగన్ మాత్రం మేనిఫెస్టోను పవిత్రగ్రంథంలా భావిస్తున్నారు. నవరత్నాల అమలుతో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి” అని విజయసాయి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.