ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైరుతి రుతుపవనాలు వ‌చ్చేస్తున్నాయి.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 08, 2019, 02:53 PM

నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు  భారత వాతావరణ విభాగం ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఈ రుతుపవనాల రాకతో కేరళలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయ‌ని, ఈ నెలఖారు నాటికి నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించచ‌డంతో నాలుగు నెలల పాటు వ‌ర్షాభావ ప‌రిస్థితులు  కొనసాగనున్నాయని పేర్కొంది. రుతుపవనాల రాకతో ఈ నెల 9, 10న కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ఐఎండీ వరుసగా నారింజ, పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. నైరుతి అరేబియా సముద్రంపై గంటకు 45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రుతుప‌వ‌నాల రాక‌తో ఎండ‌ల‌తో మండుతున్న రాష్ట్రాలు కాసింత సేద తీర నున్న‌ట్టు క‌నిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com