ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఉదయం 11:49 గంటలకు మంత్రవర్గ ప్రమాణ స్వీకారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2019, 12:05 PM

ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం రేపు ఉదయం జరుగనున్నది. ఉదయం 11 గంటల 49 నిముషాలకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సచివాలయ ప్రాంగణంలో గవర్నర్‌ నరసింహన్‌ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మనం చేసే ప్రతి పనీ, ప్రతి కార్యక్రమంతో ప్రజలకు చేరువ కావాలని ఎపి ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో జగన్‌ మాట్లాడుతూ మనం వేసే ప్రతి అడుగు ద్వారా మన గ్రాఫ్‌ పెరగాలని చెప్పారు. పాలనలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. అవినీతికి తావివ్వకుండా పాలన సాగాలని ఆయన అన్నారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిసి జ్యుడిషియల్‌ కమిషన్‌ గురించి అడిగానని ఆయన చెప్పారు. టెండర్ల ప్రక్రియ మొదటినుంచి జడ్జి వద్దకు వెళుతుందని, ఏడు రోజులపాటు దానిఇన పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచుతామని ఆయన అన్నారు. ఆరోపణలు వచ్చిన వాటిపై రివర్స్‌ టెండర్‌ ప్రక్రియ చేపడతామని ఆయన చెప్పారు. రివర్స్‌ టెండరింగ్‌లో ఎంత మిగిలిందో ప్రజలకు చెబుతామని ఆయన అన్నారు. చంద్రబాబు పాలనలో టిడిపి నేతలు అంచనాలకు మించి దోచుకున్నారని ఆయన ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com