హైదరాబాద్ : దుబాయ్లోని రశీదియ ఎగ్జిట్ సమీపంలో గురువారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ సిగ్నల్ పడిన తర్వాత బస్సు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి పోలీసులు నిర్ధారించారు. 31 మంది ప్రయాణికులతో ఒమన్ నుంచి దుబాయ్కు బస్సు వెళ్తుంది. రశీదియ ఎగ్జిట్ వద్ద సిగ్నల్ జంప్ కారణంగా బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోగా, వీరిలో 8 మంది భారతీయులు ఉన్నారు. ఈ మేరకు మృతుల వివరాలను ఇండియన్ కాన్సులేట్ వెల్లడించింది. మృతుల పేర్లు.. రాజగోపాలన్, ఫిరోజ్ ఖాన్ పఠాన్, రేష్మా ఫిరోజ్ ఖాన్ పఠాన్, దీపక్ కుమార్, జమాలుద్దీన్ అర్కవేట్టిల్, కిరణ్ జానీ, వాసుదేవ్, తిలక్రాం జవహర్ ఠాకూర్ గా ఇండియన్ కాన్సులేట్ వెల్లడించింది.