అమరావతి : తాడేపల్లి లోని తన నివాసం నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లి,వచ్చేటప్పుడు, తన ఇతర పర్యటనల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ ఎయిర్ పోర్టుకు వెళ్ళి వచ్చేటప్పుడు ప్రజలు అవస్ధలు గమనించారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని పోలీసు, సీఎంఓ అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరంలో ప్రత్యామ్నాయ మార్గాల గురించి పోలీసు అధికారులు అన్వేషిస్తున్నారు.