ఉత్తరాంధ్రలోని పలుచోట్ల ఈరోజు పిడుగులు పడే అవకాశముందని ఆర్టీజీఎస్ తెలిపింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది. బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద ఉండటం ప్రమాదకరమని హెచ్చరించింది. అలాగే ఇంట్లో విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని కోరింది. ఈ మేరకు ఆర్టీజీఎస్ హెచ్చరికలు జారీచేసింది