ముంబై దాడుల సూత్రధారి, జమాత్-ఉద్-దవా (జెయుడి) అధ్యక్షుడు హఫీజ్ సయీద్ ఈద్ ప్రార్థనలకు నేతృత్వం వహించకుండా పాకిస్తాన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఖద్ధాఫీ స్టేడియంలో జరిగే ఈద్ ప్రార్థనలకు హఫీజ్ నేతృత్వం వహించకపోవడం ఇదే మొదటిసారి అని ప్రభుత్వం పేర్కొంది. జెయుడిని ఉగ్రవాద సంస్థగా ఐక్య రాజ్య సమితి (యుఎన్) ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ అధిపతి అయిన హఫీజ్ తన నివాసానికి దగ్గరలో ఉన్న స్థానిక మసీదులో ప్రార్థనలు చేశారు.