బంగ్లాదేశ్కు చెందిన సుప్రసిద్ధ నటీమణి అంజుఘోష్ బిజెపిలో చేరారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బిజెపి శాఖ అధ్యక్షుడు, ఎంపి దిలీప్ ఘోష్ సమక్షంలో అంజు బిజెపిలో చేరారు. కాగా ఆమెకు భారతదేశ పౌరసత్వం లభించిందా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అంజు నిరాకరించారు. 1989లో అంజు ఘోష్ నటించిన బెదెర్ మేయే జోస్నా అనే చిత్రం బంగ్లాదేశ్ సినీ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లతో విజయ దుందుభి ప్రమోగించింది. ఆ తరువాత అంజు అనేక భారతీయ చిత్రాల్లో కూడా నటించింది.