క్రికెట్ వరల్డ్ కప్లో ఈరోజు టీమిండియా తన మొదటి ఆటను సౌత్ ఆఫ్రికాతో ఆడుతోంది. ఇప్పటి వరకు రెండు సార్లు కప్ గెలుచుకున్న టీమిండియా మూడోసారి కూడా కప్ గెలవాలని భారతీయులు కోరుకుంటూ.. ఎవరికి తోచిన విధంగా వారు టీమిండియాపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ తరుణంలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో సైంటిఫిక్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్న తెలుగు వ్యక్తి ఎస్.ఫణి కృష్ణ.. టీమిండియాకు మద్దతుగా ఓ పాటను రూపొందించారు. ‘‘కప్ మనదే.. వరల్డ్ కప్ మనదే’’ అంటూ సాగే ఈ పాట అందరిని ఆకట్టుకుంటోంది.