జాతిపిత, అహింసా మూర్తి మహాత్మా గాంధీతోపాటు, జాతీయ చిహ్నమైన అశోకస్తంభలోని చక్రానికి కూడా ఘోర అవమానం జరిగింది. గాంధీ, అశోక చక్రం చిత్రాలతో కూడిన టైల్స్ మరుగుదొడ్లలో ప్రత్యక్షమయ్యాయి. ఉత్తర ప్రదేశ్లోని బులంద్ షహార్లో ఈ దారుణం జరిగింది. స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం కింద నిర్మించిన మరుగుదొడ్లలో కొందరు ఈ మురికి పనికి పాల్పడ్డారు. దీబాయ్ తహశీల్లోని ఇచ్చవరిలో 508 టాయిలెట్లు కట్టగా, 13 టాయిలెట్లలో గాంధీ, అశోక చక్ర టైల్స్ వాడారు. దొడ్లలోకి వెళ్లిన వారు వీటిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే ఓ అధికారిని సస్పెండ్ చేశామని అధికారులు చెబుతున్నారు. టైల్స్ తొలగించి, కొత్త వాటిని అతకబెట్టించామని, జాతిపితను అవమానించడం సరికాదని అంటున్నారు.