ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2019, 07:07 PM

మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విషయంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటును కేటాయించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ఐదేళ్ల లోపు వైసీపీ ఎన్డీయేలో చేరితే వైవీ సుబ్బారెడ్డికి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కే అవకాశముంది.
2014 ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైవీ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కూడా ఒంగోలు ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ జగన్ ఆయనను పక్కన పెట్టి మరీ టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఎంపీ టికెట్‌ను ఖరారు చేశారు. ఈ సీటును ఈ ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలుచుకుంది. టికెట్ ఇవ్వకపోవడంతో మొదట్లో అలకబూనిన వైవీ జగన్ హామీతో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. తాజాగా ఆయనను రాజ్యసభ ఎంపీగా పార్లమెంట్‌కు పంపాలని జగన్ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com