ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల దారుణ హత్య...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2019, 06:54 PM

సమాజంలో మహిళలను వేధించే పోకిరీలు ఎంతోమంది ఉన్నారు. వారిని మానసికంగా, శారీరికంగా వేధించే సైకోల గురించి మనం అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. కానీ పశ్చిమ బెంగాల్‌లో పోలీసుల చేతికి చిక్కిన ఓ నిందితుడు మాత్రం అలాంటి ఇలాంటి సైకో కాదు. ఏకంగా ఐదుగురు మహిళలను హత్య చేశాడు ఆ నిందితుడు. వాళ్లను అతడు హత్య చేసిన తీరును చూసిన పోలీసులే షాక్ అయ్యారు. అసలు ఈ నిందితుడికి ఈ రకమైన సైకోయిజం ఏమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర బర్దమాన్ జిల్లాకు చెందిన కమురుజమ్మన్ సర్కార్ అనుమాస్పదంగా కనిపిస్తూ పోలీసులకు చిక్కాడు. 


ఓ మహిళ హత్య కేసులో అతడిని నిందితుడిగా అనుమానించిన పోలీసులు... అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే... ఐదుగురు మహిళల హత్య కేసులకు సంబంధించిన మిస్టరీ బయటపడింది. బర్దమాన్‌తో పాటు సమీప జిల్లా అయిన హుగ్లీలో దాదాపు ఐదుగురు మహిళలను రాడ్‌తో కొట్టి చంపిన నిందితుడు... కొన ఊపిరితో ఉన్న వారిపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. 


 


నిందితుడు క్రూరత్వం అంతటితో ఆగలేదు. చనిపోయే సమయంలో మహిళలను నిందితుడు సర్కార్ కఠినంగా హింసించాడని పోలీసులు గుర్తించాడు. మధ్యాహ్నం సమయంలో కరెంట్ మీటర్ రీడింగ్ కోసమంటూ ఇళ్లల్లోకి ప్రవేశించి అతడు ఈ ఘాతుకాలకు పాల్పడినట్టు పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. నిందితుడు ఎర్ర బైక్, ఎర్ర హెల్మెట్ ఆధారంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా... ఈ మొత్తం హత్యలకు సంబంధించిన మిస్టరీ బట్టబయలైంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com