పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ లోపాలే తమ జట్టు ఓటమికి కారణమని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు. వరల్డ్కప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 14పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీని గురించి మోర్గాన్ మాట్లాడుతూ..‘ట్రెంట్ బ్రిడ్జ్ వంటి పిచ్పై భారీ స్కోరు ఖాయమని ముందే తెలుసు. దీనికితోడు పాక్ నిర్దేశించిన లక్ష్యం కూడా ఛేదించగల్గినదే. కానీ మ్యాచ్పై పట్టు సాధించే సమయంలో కీలక వికెట్లు చేజార్చుకోవడం కూడా మాకు ప్రతికూలాశంగా మారింది. నాకు తెలిసి మాకు ఇదేమీ చెత్త ప్రదర్శన కాదు. జట్టుగా మేము బ్యాట్, బంతితో మంచి ప్రదర్శనే చేశాం. కానీ ఫీల్డింగ్లో అనవసర తప్పిదాలు చేయడంతో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.’ అని తెలిపాడు.
‘ఇంతకుముందు మ్యాచ్ల్లో మేము బ్యాట్తో, బంతితో విఫలమైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఫీల్డింగ్లో మాత్రం ప్రతి మ్యాచ్లోనూ మెరుగైన ప్రదర్శనే చేశాం. ఇక పాక్తో మ్యాచ్లో మా శక్తి మేరకు గెలుపు కోసం పోరాటం చేశాం. కానీ కొన్ని తప్పిదాల కారణంగా మ్యాచ్ను చేజార్చుకోవాల్సి వచ్చింది.’ అని మోర్గాన్ చెప్పాడు.
పాకిస్థాన్ ఇన్నింగ్స్లో 25ఓవర్లో పాక్ బ్యాట్స్మెన్ హఫీజ్ అందించిన క్యాచ్ను జేసన్ రాయ్ నేలపాలు చేశాడు. అప్పటికీ అతని చేసిన స్కోరు 14పరుగులే. ఆ సమయంలో లైఫ్ పొందిన హఫీజ్(84; 62బంతుల్లో 8×4, 2×6) చెలరేగి ఆడి జట్టుకు ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడాడు.