భూటాన్ ప్రధానమంత్రి డాక్టర్ లోతే షేరింగ్ , ప్రధాని నరేంద్ర మోడీల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించి మరోమారు ప్రధాని పదవిని మోడీ చేపట్టడంపై డాక్టర్ లోతే షేరింగ్ ఆ దేశ ప్రజల తరఫున భారతీయులకు, ప్రదాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల సౌభాగ్యం దిశగా భారతదేశ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీతో సన్నిహితంగా పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ప్రధాని డాక్టర్ లోతే షేరింగ్ చెప్పారు. ఈ సందర్భంగా వీలైనంత త్వరగా భూటాన్ పర్యటనకు రావాలని మోబాకి ఆహ్వానం పలికారు. కాగా, తన పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై, శుభాకాంక్షలు తెలిపినందుకుగాను భూటాన్ ప్రధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి భాగస్వామ్యంతోపాటు జలవిద్యుత్ రంగంలో భూటాన్‘తో సహకారానికి భారత్ ఎంతో విలువనిస్తున్నదని , భూటాన్ సౌభాగ్యం, శ్రేయస్సు దిశగా భాగస్వామ్యానికి భారత ప్రభుత్వం కృతనిశ్చయంతో కట్టుబడి ఉన్నదని ప్రధాని మోడీ ఈ సందర్భగా పునరుద్ఘాటించారు.