మరోమారు ఏపిలో మద్యపాన నిషేదం దిశగా అక్కడి సర్కారు అడుగులు వేస్తోంది. మద్యపానమంటే రాష్ట్రానికి రాబడి మార్గంగా ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చిన ప్రభుత్వాల స్థానంలోకి కొత్తగా వచ్చిన వైసిపి ప్రభుత్వం ఈ మేరకు నిరణయాలు తీసుకుంటోంది. శనివారం ఎపి సిఎం జగన్ ఏర్పాటు చేసిన ఎక్సైజ్ అధికారుల సమావేశంలో ఐదు అంచెలలో ఏపిలో మద్య నిషేధం అములపై చర్చించారు. తొలి విడత 20 శాతం షాపులను తొలగించడంతో పాటు మద్యం రేట్లు భారీగా పెంచడం ద్వారా మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు.
రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకు చేపట్టాల్సిన కార్యాచరణ రూపొందించి తదుపరి సమావేశంలో తనకు అందించాలని అధికారులకు జగన్ ఆదేశాలిచ్చారు. అలాగే రాష్ట్రంలో మద్యం అమ్మకాలను విరివిగా ప్రోత్సహించేలా ఏర్పాటై బెల్టుషాపులపైన ప్రత్యేక దృష్టి సారించి పార్టీలకు అతీతంగా దాడులు నిర్వహించి, పూర్తిగా తొలగించే చర్యలు చేపట్టాలని ఈ దుకాణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎక్సయిజ్ కమీషనర్ను ఆదేశించారు.