భారత్కు కల్పించిన జీఎస్పీ హోదాను రద్దు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు వైట్ హౌజ్నుంచి ఓ ప్రకటన వెలువడింది. అమెరికా వస్తువులపై భారత్ అత్యధిక పన్నులు విధిస్తోందన్నదని, అమెరికా ఉత్పత్తులకు భారత మార్కెట్లలో తగిన వాతావరణాన్ని కల్పించడంపై భారత్ నుంచి ఇప్పటికీ ఎటువంటి హామీ లభించనందున భారత్కు ప్రాధాన్య వాణిజ్య హోదా రద్దు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధికి దన్నుగా నిలిచే క్రమంలో అమెరికా ప్రవేశపెట్టిన జీఎస్పీ వ్యవస్థలో భారత్ అగ్రగామిగా ఉన్న విషయం విదితమే. ఓవైపు భారత్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తూనే మరోవైపు ట్రంప్ భారత్పై ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. అమెరికన్ కాంగ్రెస్లోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ పాలక వర్గం వ్యాఖ్యానించడం గమనార్హం.