ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ సీటీలో శుక్రవారం(మే-30,2019) ఓ అంతర్జాతీయ సంస్థకు చెందిన వాహనాల కాన్వాయ్ టార్గెట్ గా జరిపిన కారు బాంబ్ పేలుడు లో నలుగురు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. కాబూల్ నగరంలోని ఖాలా ఏ వజీర్ ప్రాంతంలో ఉదయం 8.30 గంటలకు ఈ బ్లాస్ట్ జరిగింది.ఈ పేలుడు ఇప్పటివరకు ఎవరూ తమదే బాధ్యత అని ప్రకటించుకోలేదు.ఈ పేలుళ్లలో అమెరికాకు చెందిన ఓ సర్వీసు మెన్ గాయపడ్డారని ఆఫ్ఘనిస్థాన్ విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నస్రత్ రహిమీ తెలిపారు. కాబూల్ లో రెండు రోజుల్లో ఇది రెండో బాంబు పేలుడు.గురువారం మిలటరీ ట్రైయినింగ్ అకాడమీ బయట ఐసిస్ తీవ్రవవాదులు జరిపిన బ్లాస్ట్ లో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే.