ఎన్నికల ముందువరకు ఏపీకి సీఎస్ గా పనిచేసి ప్రస్తుతం ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న అనిల్ చంద్ర పునేఠా రేపు(శుక్రవారం) పదవీ విరమణ చేయనున్నారు. 1984 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన పునేఠా ఎన్నికలకు ముందు వరకు సిఎస్ గా బాధ్యతలు నిర్వహించగా వైసీపీ ఆరోపణలతో ఈసీ బాధ్యతలను తప్పించగా ఎన్నికల అనంతరం ఆయన్ను మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. అయితే రేపు అయన పదవీ విరమణ చేయనున్నారు.