ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి నోటిదురుసు ప్ర‌యోగించిన యుపి సిఎం యోగీ!

national |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2019, 08:52 PM

తనమీద ఎన్నికల కమిషన్ విధించిన బ్యాన్ ముగిసిన వెంటనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రహ్మాన్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. వారు బాబర్ సంతాన మంటూ విద్వేష వ్యాఖ్యలు చేశారు. ఓ ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడిన యోగి.. ’’ఒకసారి పార్లమెంట్‌లో ఆయనను కలిసి మీ పూర్వీకులు ఎవరని అడిగితే.. తాను బాబర్ సంతానమని చెప్పారు. ఆ సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది’’ అంటూ రహ్మాన్‌ను ఉద్దేశించి కామెంట్లు చేశారు. వందేమాతరం పాడేందుకు ఇష్టపడని ఓ వ్యక్తి.. బాబా సాహెబ్ అంబేద్కర్‌కు పూలమాల వేసేందుకు ఇష్టపడని ఓ వ్యక్తి మీ ఓట్లకు అనర్హుడంటూ యోగి పేర్కొన్నారు. కాగా కొన్ని రోజుల క్రితం అలీ, భజరంగ్ బలీ అంటూ యోగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎన్నికల కమిషన్ మూడు రోజుల ప్రచార నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com