ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిచ్చి పీక్‌కు చేరింది!వరద నీటిలో నిల‌బ‌డి రిపోర్టింగ్!

international |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2019, 10:23 PM

నాడు పాకిస్థాన్‌లో గాడిదపై ఎక్కి ఓ రిపోర్టర్ రిపోర్టింగ్ చేస్తూ బొక్క బోర్లాపడి సెన్సేషనల్ సృష్టిస్తే.. తాజాగా మరొకరు మరీ లైవ్‌గా ఉంటుందని వరద నీళ్లలో నిలబడి రిపోర్టింగ్ చేసిన వైనం జర్నలిస్ట్ లోకాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ‘‘ఎవరూ తేలేని, ఏ చానలూ కవర్ చేయని వార్తను నువ్వు తేవాలంటూ ప్రొడ్యుసర్ హుకుం జారీ చేయడంతో జర్నలిస్ట్, తన ప్రాణాలకు తెగించి వరద నీటిలో ఇలా రిపోర్టింగ్ చేశాడంటూ’’ నైలా ఇనయత్ అనే ఒక జర్నలిస్ట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లైవ్‌గా ఆ నీటిలోనే ఛాతీ వరకు నిలబడి ‘అత్యంత సాహసంగా’ రిపోర్ట్ చేసేసరికి తమ ట్విట్టర్‌లలో నెటిజన్లు సెటైర్లతో విరుచుకుపడ్డారు. ఇదో పెద్ద కామెడీ ప్రహసనంలా తయారైందని ఒకరంటే.. మరొకరు ఇలాంటి వారికి పులిట్జర్ అవార్డు ఇవ్వాలంటూ జోకులేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com