లోక్ సభ ఎన్నికల రెండో దశలో మొత్తం 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అసోంలో ఈవీఎంలు మొరాయించడంతో అక్కడ కొన్నిచోట్ల పోలింగ్ ముందుకు సాగట్లేదు. అసోంలోని నార్త్ కరీంగంజ్లో అసలు పోలింగే మొదలవ్వలేదు. అక్కడి ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడంతో... పోలింగ్ని నిషేధించాలని ప్రజలు నిర్ణయించారు. ఉదయం 10.30 వరకూ అక్కడ ఒక్క ఓటు కూడా పడలేదు. ఓ మహిళ మాత్రం కళ్లు తిరిగి కింద పడింది. ఈవీఎంలపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు... అధికారులపై మండిపడుతుంటే.. టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.