ప్రధాని మోదీపై విజయ్ మాల్యా మరోసారి విమర్శలు గుప్పించారు. తాను చెల్లించే బకాయిల విషయంలో ప్రధానీ మోడీ అబద్ధాలు చెబుతున్నారా లేదా బ్యాంకులు చెబుతున్నాయా అర్ధం కావడంలేదంటూ ట్వీట్ చేశారు. బ్యాంకులను నేను చెల్లించాల్సిన రుణాల కంటే ఎక్కువగానే ప్రభుత్వం రికవరీ చేసుకుందని ప్రధాని మోడీనే ఓ ఇంటర్వూలో చెప్పారు. కానీ ఇంగ్లీష్ కోర్టుల్లో కొన్ని బ్యాంకులు ఇందుకు పూర్తి విరుద్ధంగా చెప్పాయి. ఎవరిని నమ్మాలి? అయితే మోదీ లేదా బ్యాంకులు ఎవరో ఒకరు అబద్ధం చెప్పి ఉండాలి అని మాల్యా ట్వీట్ చేశారు.