దేశ వ్యాప్తంగా రెండో విడత లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. 13 రాష్ట్రాల్లోని 95నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల ప్రజలు తమ ఓటు హక్కను వినియోగించుకుంటున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్లో ఓ నవ వధూవరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెళ్లి దుస్తులతో నేరుగా ఉదంపూర్లోని పోలింగ్ బూత్కు వచ్చిన ఈ నవ వధూవరులు తమ ఓటును వేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు.