రెండో దశ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికే ఉదయం సమయంలో సినీ ప్రముఖులంతా పోలింగ్ స్టేషన్లకు క్యూ కట్టారు... సినిమా సెలబ్రిటీలు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భార్య షాలినీతో కలిసి పోలింగ్ స్టేషన్కు వచ్చిన తమిళ హీరో అజిత్... తిరువన్మయూరులోని పోలింగ్ స్టేషన్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.