ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోడలు గర్భిణి అన్న కనికరం కూడా లేకుండా..కాలితో తన్నిన అత్త!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2019, 09:15 AM

విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం ఓ మహిళను భర్త, అత్త కలిసి చిత్రహింసలు పెట్టారు. గర్భిణి అన్న కనికరం కూడా లేకుండా కోడలిని కాలితో తన్నింది ఆ అత్త! తల్ల చేష్టలకు అడ్డు చెప్పకపోగా…భార్య మరణికట్టుపై బ్లేడ్‌తో కోసి దాడి చేశాడు భర్త! అయితే.. ఆ రాక్షసుల నుంచి తప్పించుకున్న బాధితురాలు.. ఆసుపత్రిలో చేరింది. విశాఖ జిల్లా పెందుర్తిలో గురజాల దామోదర్‌…… తన భార్య రాజేశ్వరిని చిత్ర హింసలు పెడుతున్నారు. అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నాడు. అతడికి తల్లి లలిత కూడా వత్తాసు పలికింది. అరోనెల అని తెలిసినా బిడ్డను కనొద్దంటూ అత్త లలిత కడుపులో గుద్దినట్టు బాధితురాలు చెప్పారు. 25 లక్షలు కట్నం ఇస్తేనే పిల్లలను కనాలని కండీషన్ పెట్టినట్టు తెలుస్తోంది. ….


కట్నం తీసుకురాకుంటే… అబార్షన్‌ చేయించుకోవాలంటూ.. భర్త దామోదర్‌, అత్త లలిత బెదిరించారు. ఇప్పటికే మూడు సార్లు అబార్షన్‌ చేయించినట్లు తెలుస్తోంది. మరోసారి అబార్షన్‌ చేయించుకోవాలంటూ రాజేశ్వరిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కారులోనే ఆమెపై దాడికి తెగబడ్డారు. చేతులపై బ్లేడ్‌తో గాయాలు చేశారు. పొట్టపై కూడా దాడి చేశారు.భర్త, అత్త పెట్టిన చిత్రహింసలతో తీవ్రంగా గాయపడింది రాజేశ్వరి. స్థానికల సహాయంతో .. భర్తను నుంచి తప్పించుకుని ఆసుపత్రిలో చేరింది బాధితురాలు. ప్రస్తుతం కేజీహెచ్‌ లో చికిత్స పొందుతుంది. ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అత్త, భర్తపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు పోలీసులు. బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ….






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com