కెనడాలోని అల్బెర్టా రాష్ట్రానికి ఈ నెల 16 న అల్బెర్టా అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ సంతతికి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నికయి రికార్డు సృష్టించారు. గుంటూరు కి చెందిన ప్రసాద్ పాండా, విజయనగరానికి చెందినా లీల అహీర్ ఈ ఎన్నికల్లో అధికారం చేజక్కించుకున్న యునైటెడ్ కన్సర్వేటివ్ పార్టీ (యుసీపీ) తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఈ గెలుపు పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
ఈ రోజు వాటి ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 87 స్థానాలున్న అసెంబ్లీకి గాను యుసీపీ 64 సీట్లలో గెలుపొంది అధికార పగ్గాలు చేపట్టబోతోంది. కెనడాలో బాలట్ పేపర్ ను వినియోగించారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రసాద్ పాండా, లీల అహీర్ రెండో సారి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావటం విశేషం. లీల గత జనవరిలో విజయనగరాన్ని సందర్శించారు. న గతంలో కెనడాకి ఉప ప్రధానిగా ఉన్న జాసన్ కెన్ని అల్బెర్టా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. మధ్య తూర్పు తర్వాత అల్బెర్టా అపారమైన చమురు వనరులు లభ్యమయ్యే ప్రాంతం.ఆయఆంధ్రప్రదేశ్ తో మంచి సంబంధాలు పెట్టుకోవాలని చంద్రబాబు ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.